ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు పడనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకుండా.. రోడ్లపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. అలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు గతంలో ఉన్న ఫైన్లు సరిపోవని.. వాటిని భారీగా పెంచితే.. వాహనదారులు కొంతైనా దారిలోకి వస్తారని ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గరిష్ఠంగా రూ.10 వేలు ఫైన్ విధించనున్నారు.