పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా అమృత్ 2.0 పథకం కింద 281 ప్రాజెక్టులను రూ.10,319 కోట్లతో చేపట్టే అంచనాలకు ఆమోదం తెలిపింది. ఈ పనులను కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (ఛామ్)లో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-2026 ఎస్ఎస్ఆర్ (Standard Schedule Of Rates) రేట్ల ప్రకారం టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.