అరుదైన ఖనిజాల తవ్వకాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అరుదైన ఖనిజాలు కలిగిన బీచ్ శాండ్ తవ్వకాల కోసం మరిన్ని లీజులు కేటాయించాలని తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. అందులో భాగంగా గతంలో కేటాయించిన 1000 హెక్టార్ల బీచ్ శాండ్ లీజులకు అదనంగా.. మరో 5000 హెక్టార్ల లీజులు కేటాయించాలని కోరింది. ఈ బీచ్ శాండ్ లీజులున్న చోట్ల.. అటవీ భూములు ఉంటే.. వాటికి ప్రత్యామ్నాయంగా గతంలో సేకరించిన భూములను ఉపయోగించాలని భావిస్తోంది.