AP Municipal Workers Strike August 2: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ సిబ్బంది ఆగస్టు 2 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీసు అందజేసింది. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. మరోవైపు, రాష్ట్రంలో ఆగిపోయిన 71 సాగునీటి ప్రాజెక్టుల పనులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.