Andhra Pradesh Tribal Gurukulams Guest Faculty Salaries Hike: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచుతూ శుభవార్త చెప్పింది. జూనియర్ లెక్చరర్ల నుంచి పీఈటీల వరకు వేతనాలు పెరిగాయి. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిని ఎంఈవోలు పర్యవేక్షిస్తారు. మొక్కలు నాటి పెంచిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇస్తారు.