AP Fibernet Employees Terminated: ఇటీవల ఏపీ ఫైబర్నెట్ సంస్థ విషయంలో పెద్ద వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి పదవితో పాటుగా తెలుగు దేశం పార్టీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్నెట్ ఎండీగా ఉన్న దినేష్కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే దినేష్ కుమార్ మంత్రి జనార్థన్ రెడ్డికి రిపోర్ట్ అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల తొలగింపై కూడా కీలక ప్రకటన చేశారు.