AP Govt Released Salaries For Guest Lecturers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లకు రూ.15.75 కోట్ల గౌరవ వేతనాలు విడుదల చేసింది. ఈ మేరకు వారి అకౌంట్లలో జీతం డబ్బుల్ని విడుదల చేస్తున్నారు. పెండింగ్ జీతాలు విడుదల చేయడంపై లెక్చరర్లు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరోవైపు, గ్రామాల్లో కొత్త పథకాలపై అవగాహన కల్పించడానికి గ్రామసభలు నిర్వహించనున్నారు.