AP Tribal Gurukulams Guest Faculty Salaries Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల లెక్చరర్లు, లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల వేతనాలు కూడా పెరగనున్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తున్నారు.