Tirumala Express Passengers Ticket Problems: తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. గుంతకల్లు నుండి తిరుపతి వెళ్ళే ప్రయాణికులు రెండు టికెట్లు కొనాల్సి వస్తోంది. కడపలో టికెట్ కోసం దిగితే బెర్తులు దొరకడం లేదు. రైలుకు సంబంధించిన బోర్డులో మార్పులు లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ రెండు టికెట్ల అంశంపై రైల్వే అధికారులు స్పందించారు.. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అంటున్నారు.