కోనసీమ జిల్లా మలికిపురం బ్లో అవుట్ బాధిత కుటుంబాలకు ఓఎన్జీసీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఇరుసమండ బ్లో అవుట్ ఘటనలో బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 వేలు చొప్పున అందించనుంది. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 6300 కుటుంబాలకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.