AP Free Bus Not Implement In Karnataka Border: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు పథకం ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంత మహిళలకు వర్తించకపోవడంతో వారు నష్టపోతున్నారు. కర్ణాటకకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం అమలు కావడం లేదు. దీంతో పెనుకొండ, ఉరవకొండ వంటి ప్రాంతాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్రాష్ట్ర బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.