ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలపాటు ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు నెలలు గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకూ బయట తిరగకుండా ఇళ్లల్లోనే ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకూ శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని సూచించింది.