ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. తల్లికి వందనం, విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పథకాన్ని నిలిపివేసిందంటుూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పథకం ఆగిపోయిందనేది అవాస్తమన్న నారా లోకేష్.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కిట్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.