AP Govt Stipend For Disabled Children: దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిత కేంద్రాల ద్వారా విద్య, వైద్యం అందిస్తోంది. వినికిడి లోపం, పక్షవాతం, బుద్ధి మాంద్యం వంటి సమస్యలున్న పిల్లలకు ప్రత్యేక శిక్షణ, ఆర్థిక సహాయం అందుతోంది. బాలికలకు నెలకు రూ.500, బాలురకు రూ.300 చొప్పున పది నెలలు స్టైఫండ్తో పాటు రవాణా భత్యం కూడా లభిస్తుంది. ఈ కేంద్రాల సేవలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.