Andhra Pradesh Panchayat Raj Employees Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పులు చేసింది. మండల, జిల్లా పరిషత్తుల్లోని 73 మంది పరిపాలనాధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.1,121.20 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా, హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సహాయ ప్రభుత్వ న్యాయవాదులను నియమించింది. హజ్ కమిటీ ఛైర్పర్సన్ ఎన్నికను ఈ నెల 30న నిర్వహించనున్నారు.