Andhra Pradesh APSRTC Employees Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. వారికి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైంది. మెరిట్ రేటింగ్ రిపోర్టుల ఆధారంగా సుమారు 110 మంది అధికారులకు పదోన్నతులు లభించనున్నాయి. అంతేకాకుండా, ఏపీ ఫైబర్నెట్కు రూ.112.50 కోట్ల నిధులు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దేవాదాయశాఖ పరిధిలోని భూములను సేవా సంస్థలకు కేటాయించేందుకు నిబంధనలు సవరించింది.