ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపించటం, మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం వంటి కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో విజయవాడ శివారు ప్రాంతమైన ఉయ్యూరు వంటి చోట్ల భూములకు డిమాండ్ పెరుగుతోందని.. రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి జాతీయ రహదారి విస్తరణ గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.