ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఒప్పందాలు కుదరగా.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు భూములను కేటాయించగా.. గూగుల్ కూడా పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం తర్లువాడలో 80 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. మరోవైపు ఐటీ పరిశ్రమల రాకతో విశాఖలో ఐటీరంగానికి కొత్త వెలుగులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.