Pamarru Bus Stand Named As Ntr: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బస్టాండ్కు ఎన్టీఆర్ పేరు పెట్టింది. కృష్ణా జిల్లా పామర్రు బస్టాండుకు నందమూరి తారక రామారావు ప్రయాణ ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్టీఆర్ సొంత గడ్డపై ఆయన పేరు పెట్టడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా తెలిపారు. శిథిలావస్థకు చేరిన బస్టాండును రిపేర్లు చేయించి, కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్కు ఎండ్ కార్డ్ పడింది.