ఏపీలో పారిశ్రామిక రంగం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం ఉత్తరాంధ్ర జిల్లాలు.. అందులోనూ విశాఖ కేంద్రంగా తరలివెళ్తున్నాయి. డేటా సెంటర్లతో పాటుగా ఐటీ సంస్థలు, టూరిజం రంగాలలోనూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంతో పాటుగా అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.