Gudur Vijayawada Third Railway Line Trail Run: ఆంధ్రప్రదేశ్లో గూడూరు-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. 293 కిలోమీటర్ల మార్గంలో 251 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. తాజాగా సురారెడ్డిపాలెం నుండి సింగరాయకొండ వరకు 18 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి కావడంతో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు 140 కి.మీ వేగంతో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.