Amaravati Farmers Koulu Money Released: అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రజా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు, భూ యజమానులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును ఏపీ సీఆర్డీఏ తాజాగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. సాంకేతిక సమస్యలు, ప్లాట్ల అమ్మకాలు, వారసుల వివరాలు అందకపోవడం వంటి కారణాలతో కొందరికి గతంలో కౌలు డబ్బులు అందలేదు. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి మొత్తం 495 మందికి రూ.66.48 కోట్ల పెండింగ్ కౌలును సీఆర్డీఏ తాజాగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.