NBA Releases Rs 3 Crore To Red Sanders Farmers: కేంద్రం దేశంలో జీవవైవిధ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్బీఏ) రూ.3 కోట్లు విడుదల చేసింది. 'యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్' కింద ఈ నిధులు అందిస్తున్నారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రైతులు లబ్ధి పొందుతారు.