Chandrababu Naidu Review On Crop: రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలతో సమీక్షలో పొగాకు సాగు నియంత్రణ, కోకోకు ప్రత్యేక విధానం, మిర్చిలో నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని, పొగాకును కంపెనీలు కొనాలని సూచించారు. క్వింటాల్కు రూ.12,500 చెల్లించాలని, కోకో గింజలను కిలోకు రూ.500 తగ్గకుండా కొనాలని తెలిపారు.