Andhra Pradesh Rs 150 Crores For Mango Farmers: మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. త్వరలోనే రూ.150 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జూన్, జులై నెలల్లో సేకరించిన మామిడికి సబ్సిడీ అందిస్తారు. రైతుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించిన మామిడి రైతులకు కూడా మద్దతు ధర లభిస్తుంది.