Karedu Farmers Indosol Rs 20 Lakhs: నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ పరిశ్రమ భూసేకరణ వివాదం కొలిక్కి వచ్చింది. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వడానికి కంపెనీ అంగీకరించడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతులతో చర్చలు జరిపారు. పరిశ్రమ వల్ల కలిగే లాభాలను వివరించారు. రైతుల అభ్యర్థన మేరకు పరిహారం పెంచడంతో దాదాపు 100 ఎకరాల భూమిని ఇవ్వడానికి రైతులు అంగీకరించారు. త్వరలోనే మిగిలిన రైతులు కూడా ముందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.