Andhra Pradesh Totapuri Mango Farmers Big Relief: ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. తోతాపురి మామిడికి క్వింటాకు రూ.1,490 మార్కెట్ ధరను నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో ఈ ధరను చెల్లిస్తాయి. ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. కేంద్రం నిర్ణయం పట్ల రైతులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రైతులకు అండగా నిలిచాయి.