Kurnool Railway Station Amrit Bharat Scheme Funds: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ను రూ.42.62 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న ఈ పనుల్లో భాగంగా స్టేషన్ ముఖద్వారం ఆధునీకరణ, పార్కింగ్, ప్లాట్ఫారం అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు, రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ పనులను పరిశీలించారు.