ఏలూరు రైల్వేస్టేషన్ కొత్త శోభను సంతరించుకుంది. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద స్టేషన్ అభివృద్ధి చేశారు. ద్వారకా తిరుమల గాలి గోపురం తరహాలో రైల్వేస్టేషన్ ఎంట్రన్స్ తీర్చిదిద్దారు. అలాగే ఆలయానికి స్వాగతం పలుకుతున్నట్లుగా రైల్వేస్టేషన్ ఆర్చిని డిజైన్ చేశారు. పనులు తుది దశకు చేరుకోవటంతో రైల్వే శాఖ ఏలూరు రైల్వేస్టేషన్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇంటీరియర్, వెయిటింగ్ హాళ్లు కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.