Vande Bharat Express Stop In Hindupur: కాచిగూడ-యశ్వంత్పూర్ వందేభారత్ రైలు శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంలో కూడా ఆగనుంది. హిందూపురంలో రైలు ఆపాలని ప్రయాణికులు కోరడంతో రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఎంపీ బీకే పార్థసారథి విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు హిందూపురంలో రైలు ఆపేందుకు అంగీకరించారు. ప్రయోగాత్మకంగా కొద్దిరోజులు ఆపి, టికెట్ల అమ్మకాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వందేభారత్ ఆగనుండటంతో బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.