AP Govt Reducing Home Tax For Travels Buses: ఏపీ ప్రభుత్వం ప్రైవేటు బస్సులకు పన్ను ఊరట కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం త్రైమాసికానికి సీటుకు రూ.4 వేలు ఉండగా దానిని.. రూ.2,500కు తగ్గించే ఆలోచన చేస్తోంది. ఇలా చేస్తే వందల ట్రావెల్స్ బస్సులు మళ్లీ ఏపీకి వస్తాయని అంచనా వేస్తున్నారు.. ఆదాయం కూడా పెరుగుతుంది అంటున్నారు. త్వరలోనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది.