Andhra Pradesh Special Aadhaar Enrollment Centers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఈ నెల 5 నుంచి 8 వరకు, 12 నుంచి 15 వరకు జరిగే ఈ శిబిరాల్లో 0-6 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయనున్నారు. జనన ధ్రువీకరణ పత్రంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో ఈ-గవర్నెన్స్పై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.