Andhra Pradesh Property Auto Mutation : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తులకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు చేయనుంది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో ఆటో మ్యుటేషన్ అందుబాటులోకి రానుంది. ఆస్తులకు ఆటో మ్యుటేషన్ ద్వారా అవినీతిని అడ్డుకోవటమే కాకుండా సమయం ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉన్నట్లు సమాచారం.