ఏపీలో ఇంధన సమస్యకు చెక్.. సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్ సరఫరా

2 months ago 24
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనం గత వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమివ్వగా.. స్టాక్ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. యుద్ధం నేపథ్యంలో సరఫరా నిలిచిపోయి.. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి. అయితే, ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మంగళవారం సాయంత్రానికి 90 శాతం బంకుల్లో నిల్వలు సాధారణ స్థితికి చేరాయి.
Read Entire Article