Andhra Pradesh Government Orders On Protocols: ఏపీలో ప్రజాప్రతినిధులకి ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పీకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మర్యాదలు సక్రమంగా జరగాలని ఆదేశించింది. అధికారులు వెంటనే స్పందించి, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.