ఆంధ్రప్రదేశ్లో కొత్త జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. కొన్న చోట్ల విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రధాన కూడళ్లలో ఫ్లైఓవర్ల నిర్మాణం విస్మరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు మండలాలతో పాటు కావలి, వింజమూరు, బుచ్చిరెడ్డిపాళెం వంటి కీలక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు సరైన సమయంలో స్పందించి డీపీఆర్లలో మార్పుల చేసేలా కృషి చేస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.