ఏపీలో ఇల్లు లేని వారికి ముఖ్య గమనిక. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మంజూరు చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు ఇటీవల ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనతో తాజాగా నవంబర్ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.