నైపుణ్యాభివృద్ధి, నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని లక్ష మంది యువతకు ఈ ఏడాది ఉద్యోగాలు అందిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. తెనాలి మండలంలోని బుర్రిపాలంలో జరిగిన కార్యక్రమంలో 105 మంది విద్యార్థినులకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్లుగా నియామక పత్రాలు అందించారు. అనంతరం మాట్లాడిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. నైపుణ్య శిక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని అన్నారు.