Chandrababu Deepam Scheme Review: ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆయన పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష నిర్వహించారు. అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేస్తున్నామని, వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సీఎం అన్నారు.