Apsrtc Free Bus Journey For Disabled Men: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 50% రాయితీతో ప్రయాణిస్తున్న వీరికి, ఇకపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం అమలుకు అవసరమైన లెక్కలు ఆర్టీసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు.