Chandrababu and Pawan kalyan Travel in RTC Bus: ఏపీ ప్రభుత్వం మరో హామీని అమలు చేసింది. నేటి నుంచి (ఆగస్ట్ 15) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమల్లోకి తెచ్చింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. అంతకుమందు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మహిళలతో ముచ్చటించారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు.