Kavali BJP Leaders Demand Seats Reservation For Male passengers in RTC Buses: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఈ సౌలభ్యం పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రావటంతో మహిళలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లా కావలిలో మాత్రం కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అది కూడా బీజేపీ నేతల నుంచి కావటం విశేషం.