ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం మంచి ఫలితాలు ఇస్తోంది. ఫ్రీ బస్సు ప్రారంభమైన తర్వాత రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మహిళా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాజమహేంద్రవరం చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి.. మెరుగైన వైద్య సేవల కోసం వస్తున్నారు. గత రెండు నెలలుగా ఈ సంఖ్య పెరుగుతోంది. గతంలో బస్సు ఛార్జీల భారం వల్ల పెద్దాసుపత్రికి రావడానికి జంకేవారని.. ఫ్రీ బస్సు వల్ల నెలవారీ పరీక్షలకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది.