ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీపై.. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీ శాసనసమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు అందించనున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకూ ఇళ్ల పట్టాల కోసం 70 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ మండలిలో సమాధానం ఇచ్చారు. గత వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.