వినికిడి లోపంతో బాధపడే వారి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతుంటాయి. ఈ క్రమంలోనే ఏపీలోనూ వినికిడి లోపంతో బాధపడే వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వినికిడి లోపంతో బాధపడే వారికి టచ్ ఫోన్లు పంపిణీ చేశారు. అయితే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డు కలిగిన వినికిడి లోపంతో బాధపడేవారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.