Andhra Pradesh Mgnrega Workers Money Release: ఏపీలో ఉపాధిహామీ పథకం కూలీలకు కేంద్రం తీపి కబురు అందించింది. వారికి చెల్లించాల్సిన వేతన బకాయిలను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నుంచి చేపట్టిన పనులకు వేతనాలను చెల్లించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ ఢిల్లీ వెళ్లి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల్ని కోరారు. బకాయిల చెల్లింపై సానుకూలంగా స్పందించింది కేంద్రం. దీంతో మరో రెండు రోజుల్లో కూలీలందరికీ వేతనాలు ఖాతాల్లో జమ అవుతాయని కమిషనర్ కృష్ణతేజ తెలిపారు