AP Govt Procure Onions Rs 1200: ఉల్లి రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వింటాకు రూ.1200 చొప్పున చెల్లించి వెంటనే ఉల్లి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా, వినియోగదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో రైతు బజార్ల సంఖ్యను పెంచాలని, మార్కెట్ యార్డుల్లో ఆధునిక రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.