Andhra Pradesh Weather High Temperatures Today: ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. కడపలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే మొదటి వారంలో దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో రాబోయే ఐదు రోజుల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.