తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఎకరం అమ్మితే ఏపీలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో సీన్ రివర్స్ అయిందని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే భూముల ధరలు పడిపోయాయని, రైతులు ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టే దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో యూరియా కోసం రైతులు ఎప్పుడూ లైన్లో నిలబడలేదని గుర్తు చేశారు.