Andhra Pradesh 51 Drought Mandals Released: రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. రబీ పంట కాలంలో 6 జిల్లాల పరిధిలోని 51 కరవు మండలాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మధ్యస్థంగా కరవు ప్రభావం ఉంది. ప్రకాశం జిల్లాలో 17, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 10 చొప్పున, అనంతపురంలో 7, నంద్యాలలో 5, శ్రీసత్యసాయి జిల్లాలో 2 కరవు మండలాలు ఉన్నాయి.ఆయా జిల్లాల్లో రైతులు రుణ సౌకర్యం పొందే విధానానికి జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.